Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో ‘గుండె’ తరలింపు.. గ్రీన్ ఛానల్ సక్సెస్!

జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి చెందిన బృందం సోమవారం హైదరాబాద్ మెట్రో రైల్‌లో లైవ్ ఆర్గాన్‌ను తరలించింది.

Published By: HashtagU Telugu Desk
Metro

Metro

జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి చెందిన బృందం సోమవారం హైదరాబాద్ మెట్రో రైల్‌లో లైవ్ ఆర్గాన్‌ను తరలించింది. ఫిబ్రవరి 2021లో చివరిసారిగా, L&T మెట్రో రైలుకు గుండెను రవాణా చేయడం కోసం ఆసుపత్రి నుంచి SOS కాల్ వచ్చింది. సోమవారం (సెప్టెంబర్ 26) గ్రీన్ ఛానల్ ద్వారా నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ వరకు కొట్టుకునే గుండెను తరలించడానికి ప్రత్యేక రైలును సిద్ధం చేశారు.

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన T20 క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించడానికి ప్రయాణించిన సుమారు 20,000 మంది ప్రేక్షకుల తిరుగు ప్రయాణం కోసం సెప్టెంబర్ 25 వ్యాపార వేళలకు మించి ప్రత్యేక మెట్రో రైలు సేవలను నిర్వహించడంతోపాటు ఈ తరహా ట్రాన్స్ పోర్ట్ చేయాలని నిర్ణయించారు.  ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి చెందిన ఇతర వైద్యాధికారులతో కలిసి వైద్యుల బృందం తెల్లవారుజామున 1 గంటలకు నాగోల్ మెట్రో స్టేషన్‌కు గుండెను తీసుకొచ్చారు. సజీవంగా గుండెను వెంటనే వేచి ఉన్న మెట్రో రైలు లోపలికి తరలించారు.

దాదాపు 25 నిమిషాల వ్యవధిలో, ప్రత్యేక రైలు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్‌కు చేరుకుంది, అక్కడ అపోలో జూబ్లీహిల్స్ అంబులెన్స్ ప్రత్యక్ష అవయవాన్ని,  వైద్య బృందాన్ని స్వీకరించడానికి వేచి ఉంది. మొత్తం కార్యాచరణను లైన్ 3లో మెట్రో, భద్రతా అధికారులు సజావుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టిఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ ఎండి కెవిబి రెడ్డి మాట్లాడారు. “హైదరాబాద్ మెట్రో రైలు తన ప్రయాణీకులకు సేవ చేయడానికి కట్టుబడి ఉంది. ఈ రకమైన ప్రయత్నానికి ముందుకొచ్చిన ప్రతిఒకరికి థ్యాంక్స్’’ అంటూ స్పందించారు.

  Last Updated: 26 Sep 2022, 09:41 PM IST