Drugs: డ్రగ్స్ విక్రయాలను అరికట్టడమే లక్ష్యం!

హైదరాబాద్ సిటీ పోలీసులు గురువారం ఏడుగురిని పట్టుకుని రూ. వారి నుంచి రూ.16 లక్షలు విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వాళ్లలో ఇమ్రాన్ బాబు షేక్, నూర్ మహమ్మద్ ఖాన్, సయ్యద్ ఖైజర్ హుస్సేన్

  • Written By:
  • Publish Date - January 6, 2022 / 05:33 PM IST

హైదరాబాద్ సిటీ పోలీసులు గురువారం ఏడుగురిని పట్టుకుని రూ. వారి నుంచి రూ.16 లక్షలు విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వాళ్లలో ఇమ్రాన్ బాబు షేక్, నూర్ మహమ్మద్ ఖాన్, సయ్యద్ ఖైజర్ హుస్సేన్, సయ్యద్ రషీద్ అహ్మద్ ఖాన్, నజ్బుల్ హసన్ షేక్, ఏఆర్ అనిరుధ్, కె అవినాష్ ఉన్నారు. వాళ్ల నుంచి 98 గ్రాముల కొకైన్, 45 గ్రాముల ఎండీఎంఏ, 27 ఎక్స్‌టసీ మాత్రలు, 17 ఎల్‌డీఎస్ బ్లాట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ డ్రగ్స్ కార్టెల్‌లకు చెందిన ఏడుగురిని టాస్క్ ఫోర్స్ బృందాలు పట్టుకున్నాయని, ముంబైలో ఎక్కువగా ఉన్న వ్యక్తుల నుంచి నిషిద్ధ వస్తువులు సేకరిస్తున్నారని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

‘‘డ్రగ్స్ ను నగరానికి తీసుకువచ్చిన తర్వాత ముఠాలు డ్రగ్స్ వినియోగదారులకు, యువకులకు విక్రయిస్తున్నాయి. డ్రగ్స్ తీసుకునేవాళ్లను గుర్తించి, పట్టుకుంటాం. అరెస్టు అయిన నిందితులను విచారించగా స్థానిక వ్యక్తుల పేర్లు బయటపడ్డాయి. ఎన్‌డిపిఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం మేము వారిపై చర్యలు తీసుకుంటాం. “నగరంలో డ్రగ్స్ ఉత్పత్తి, రవాణా, పంపిణీ, స్థానిక విక్రయాలను అరికట్టడమే మా లక్ష్యం’’ అని కమిషనర్ అన్నారు.