Bhagwan Ananta Vishnu Deva Prabhu : జై మ‌హా భార‌త్ పార్టీ చీఫ్ పై చీటింగ్ కేసు

జై మహా భారత్ పార్టీ వ్యవస్థాపకుడు బాబా భగవాన్ అనంత విష్ణు దేవ ప్రభు అలియాస్ రామ్ దాస్‌పై సైఫాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Jai Maha Bharath Party

Jai Maha Bharath Party

జై మహా భారత్ పార్టీ వ్యవస్థాపకుడు బాబా భగవాన్ అనంత విష్ణు దేవ ప్రభు అలియాస్ రామ్ దాస్‌పై సైఫాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించడం, మోసం చేయడం, రోడ్డెక్క‌డాన్ని సీరియ‌స్ గా తీసుకున్నారు. రాజకీయ పార్టీలో చేరితే 200 చదరపు గజాల స్థలం ఇస్తానని అనంతవిష్ణు పలు జిల్లాల్లో హామీ ఇస్తూ ప్ర‌చారం చేశారు. కానీ,ఆయ‌నిచ్చిన హామీ వాస్తవం కాద‌ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

పార్టీ వ్యవస్థాపకుడు తన పార్టీ కార్యకర్తలకు ఐదు లక్షల ప్లాట్లు, ఒక్కొక్కటి 200 చదరపు గజాల చొప్పున గ్రామ గ్రామాలు మరియు పట్టణ మురికివాడల్లో మానిఫెస్టోను పంపిణీ చేసి, వారి నుండి వేల సంఖ్యలో ఆధార్ కార్డులను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఎదురుగా ఉన్న నాసర్ అపార్ట్‌మెంట్‌లోని తన పార్టీ కార్యాలయంలో కూడా బాబా మీడియాతో దురుసుగా ప్రవర్తించారు.

“భారత శిక్షాస్మృతి (IPC)లోని 420, 290, 341 సెక్షన్‌ల కింద పబ్లిక్‌గా ఇబ్బంది పెట్టడం, మోసం చేయడం మరియు రహదారిని అడ్డుకోవడం వంటి అభియోగాలు మోపామని సైఫాబాద్ అదనపు ఇన్‌స్పెక్టర్ బి. రాజు నాయక్ తెలిపారు.
అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ విషయమై పోలీసులు ఎన్నికల సంఘానికి లేఖ రాశారని సమాచారం.

  Last Updated: 08 Jul 2022, 04:49 PM IST