హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే రౌండ్ రౌండ్ కి బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. నువ్వానేనా అంటూ సాగిన పోరులో ఈటల సత్తాచాటారు. 20వ రౌండ్ ముగిసే సమయానికి ఆయన 21 వేల మెజార్టీ సాధించి హుజూరాబాద్ లో తనకు తిరుగులేదని చాటిచెప్పారు.
ఎంతో ఉత్కంఠ రేపిన హుజారాబాద్ ఎన్నికల్లో ఈటల గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. వరుసగా 18, 19 రౌండ్స్ లోనూ ఈటలదే హవా నడుస్తోంది. 19వ రౌండ్ లో 3047 ఓట్లతో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది.
16, 17 రౌండ్స్ లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సత్తా చాటారు. 17వ రౌండ్ లో బీజేపీకి 1423 ఓట్లు వచ్చాయి.
రౌండ్ రౌండ్ కు ఈటల దే పైచేయి. 15వ రౌండ్ ముగిసే సమయానికి 2419 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
14వ రౌండ్ లో బీజేపీ ముందంజలో నిలిచింది. ఈ రౌండ్ ఈటలకు 1046 ఓట్లు వచ్చాయి.
11వ రౌండ్ టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలవగా, 12 వ రౌండ్ లో బీజేపీ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. 1217 ఓట్లతో లీడింగ్ లో ఉంది.
హుజూరాబాద్ కౌంటింగ్ లో ఈటల ముందున్నారు. 10వ రౌండ్ ముగిసేవరకు ఆయన 526 ఓట్లతో ఆధిక్యంలో నిలిచారు.
9వ రౌండ్ లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించించింది. ఈ రౌండ్ లో 1835 ఓట్లతో లీడింగ్ లో ఉంది.
ఇప్పటివరకు ప్రతిరౌండ్ లో ఈటల ఆధిక్యం ప్రదర్శించగా, ఎనిమిదో రౌండ్ లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు ముందంజలో ఉన్నారు. 162 ఓట్లతో లీడ్ లో ఉన్నారు.
హుజూరాబాద్ కౌంటింగ్ నడుస్తోంది. ప్రస్తుతం ఏడో రౌండ్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 3,432 ఓట్లతో లీడింగ్ లో ఉంది.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరో రౌండ్ లోనూ తన సత్తాను చాటారు. ఈ రౌండ్ ముగిసేవరకు బీజేపీ 2971 ఓట్లతో లీడ్స్ లో ఉంది.
ఐదు రౌండ్ లో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. 2169 ఓట్లు వచ్చాయి.
మొదటి రౌండ్ లో బీజేపీకి 4610, టీఆర్ఎస్ కు 4444, కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి.
రెండవ రౌండ్లో బీజేపీ 4947, టీఆర్ఎస్ 4769, కాంగ్రెస్ 220 ఓట్లు సాధించాయి.
మూడో రౌండ్లో కూడా బీజేపీ 911ఓట్ల ఆధిక్యంలో, నాలగవ రౌండ్లో 1273 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు ప్రవేశ పెట్టిన శాలపల్లి గ్రామంలోనూ వెనుకంజలో నిలిచింది. ఈటెలకు వ్యతిరేకంగా కనబడ్డ హుజురాబాద్ టౌన్ లో కూడా టీఆర్ఎస్ వెనుకంజలోనే ఉంది.