Crime News : సిద్దిపేటలో దారుణం.. బ‌తుక‌మ్మ ఆడుతున్న భార్యను హ‌త్య చేసి..!

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు హ‌త్య‌ల సంఖ్య పెరిగిపోతుంది. క్ష‌ణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియ‌క నిండు ప్రాణాల‌ను బ‌లి చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - September 26, 2022 / 01:00 PM IST

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు హ‌త్య‌ల సంఖ్య పెరిగిపోతుంది. క్ష‌ణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియ‌క నిండు ప్రాణాల‌ను బ‌లి చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో అక్ర‌మ సంబంధాలు వ‌ల‌న హ‌త్య‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో దారుణం జ‌రిగింది. వేరే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తుందంటూ బ‌తుక‌మ్మ ఆడుతున్న భార్య‌ను భ‌ర్త దారుణంగా హ‌త్య చేసి ప‌రార‌య్యాడు. సిద్దిపేట జిల్లా వీరాపూర్‌లో ఈ దారుణ హ‌త్య చోటుచేసుకుంది.

స్థానికులు, కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వీరాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి-ఎల్ల‌మ దంపతుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు. పెద్ద కూతురుని అదే గ్రామానికి చెందిన ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వివిధ కార‌ణాల‌తో పెళ్లి అయిన నెల రోజుల‌కే మంగ కిరోసిన్ పోసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ క్ర‌మంలో రెండో కుమార్తె స్వ‌ప్న‌ను ఎల్లారెడ్డికే ఇచ్చి రెండో పెళ్లి చేశారు. ఎల్లారెడ్డి- స్వ‌ప్న దంప‌తుల‌కు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. 6 సంవ‌త్సరాల పాటు స‌జావుగా సాగిన వీరి కాపురం ఉన్న‌ట్టు ఉండి గొడ‌వ‌లు, మ‌న‌స్ప‌ర్థ‌లు చోటుచేసుకున్నాయి. అయితే స్వ‌ప్న పెళ్లి కాక‌ముందు నుంచే వీరాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తితో 14 ఏళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తోంది. విష‌యం తెలిసిన ఎల్లారెడ్డి భార్య స్వ‌ప్న‌ను ప‌లుమార్లు మంద‌లించాడు. తాజాగా ఇదే విష‌య‌మై ఆమెతో గొడ‌వ‌ప‌డి చంపేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చాడు.

ఈ క్ర‌మంలో ఆదివారం రాత్రి స్వ‌ప్న తోటి మ‌హిళ‌ల‌తో బ‌తుక‌మ్మ ఆడుతుండ‌గా ఎల్లారెడ్డి అక్క‌డికి చేరుకొని భార్య‌ను దారుణంగా హ‌త్య చేశాడు. త‌న‌తో తెచ్చుకున్న ఇనుప రాడ్‌ను బతుక‌మ్మ ఆడుతున్న భార్య త‌ల‌పై బ‌లంగా కొట్టడంతో స్వ‌ప్న అక్క‌డికక్క‌డే మృతిచెందింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు స్వ‌ప్న త‌ల్లి ఎల్ల‌మ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నాఉ. నిందితుడు ఎల్లారెడ్డి ప‌రారీలో ఉన్న‌ట్లు ఎస్సై తిరుప‌తి తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.