Site icon HashtagU Telugu

Hyderabad: గాంధీలో బుచ్చమ్మ మృతదేహం, హరీష్ ను అడ్డుకున్న పోలీసులు

Harish Rao At Gandhi

Harish Rao At Gandhi

Hyderabad: హైడ్రా తన ఇంటిని కూల్చివేస్తుందనే భయంతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో మాజీ ఆరోగ్య మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao)తో పాటు మాజీ విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రాస్‌రెడ్డిని గాంధీ ఆస్పత్రికి పోలీసులు అనుమతించలేదు. దీంతో గాంధీ ఆస్పత్రి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మ(Buchamma Suicide), తమ ప్రాంతంలో హైడ్రా కూల్చివేత జరిగితే తాను, తన ముగ్గురు కుమార్తెలు నిరాశ్రయులవుతారని భయపడి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుచ్చమ్మ మృతదేహం ఉంచిన గాంధీ ఆస్పత్రిని సందర్శించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి హరీశ్‌రావు ప్రయత్నించారు.దీంతో హరీష్ మరియు ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీ ప్రాంగణంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు తమ తల్లి అంత పిరికి స్వభావం కాదని బుచ్చమ్మ కుమార్తెలు వాపోయారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతల్ని వారు తప్పుబట్టారు.

హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ బుచ్చమ్మను రాష్ట్ర హత్యగా అభివర్ణించారు. బుచ్చమ్మ ఆత్మహత్యతో చనిపోలేదు. ఇది రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య. అఘాయిత్యాలను ఆపడానికి ఇంకా ఎంత మంది చనిపోవాలని నేను అడగాలనుకుంటున్నాను అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు.

ఇదిలా ఉండగా… ఆత్మహత్యకు హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదని హైడ్రా చైర్మన్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. కూకట్‌పల్లిలోని యాదవ్‌ బస్తీలో నివాసముంటున్న బుచ్చమ్మ, ఆమె భర్త జి శివయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తలు ఆ ఇంటిని కట్నంగా కూతుళ్లకు ఇచ్చారు. అయితే ఇటీవల హైడ్రా అధికారులు తమ ఇంటి పరిసరాల్లో డిమోషన్ డ్రైవ్‌లు చేపట్టడంతో తమ నివాసం కూడా కూల్చివేయబడుతుందని, తన కుమార్తెలు నిరాశ్రయులవుతారని భయపడిన బుచ్చమ్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Also Read: IND vs BAN 2nd Test: హోమ్ గ్రౌండ్ లో ఆడాలన్న కల చెదిరింది