తెలంగాణలో గురుకుల పాఠశాలల (Telangana Gurukulam Schools) నిర్వహణపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao) ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తన X ఖాతాలో పోస్ట్ చేశారు. విష జ్వరాలు, పాము కాట్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఘటనలు గురుకులాల్లో పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయమని హరీశ్ రావు పేర్కొన్నారు. విద్యార్థులు భద్రత లేని పరిస్థితుల్లో చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు.
Kharge : ఈసీ పదేళ్లుగా ఓటు చోరులకు రక్షణ కల్పిస్తుంది: మల్లికార్జున ఖర్గే ఆరోపణలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని హరీశ్ రావు గుర్తు చేశారు. నాటి ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, అద్భుతమైన వసతులు కల్పించిందని ఆయన అన్నారు. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు నరక కూపాలుగా మారాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం పట్ల కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, ఇది గురుకులాల నిర్వహణపై ప్రభావం చూపుతోందని హరీశ్ రావు పేర్కొన్నారు.
గురుకులాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలోని గురుకుల విద్యార్థుల పరిస్థితిని మెరుగుపరచడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేకపోతే ఈ సమస్యలు మరింత తీవ్రమై, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయం.
విష జ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్ తో విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించింది.
గురుకులాల్లో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్…
— Harish Rao Thanneeru (@BRSHarish) September 7, 2025