Site icon HashtagU Telugu

Telangana Global Summit 2025 : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే అతిరథులు వీరే !!

Guests Coming To The Telang

Guests Coming To The Telang

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 మరియు 9వ తేదీల్లో నిర్వహించనున్న’తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025′ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక, సినీ, క్రీడా రంగాల దిగ్గజాలు హాజరుకానున్నారు. ఈ సదస్సు రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పెంచడానికి వేదిక కానుంది. ముఖ్యంగా భారతదేశం నుంచి గౌతమ్ అదానీ (అదానీ గ్రూప్ ఛైర్మన్), అనంత్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్), ఆనంద్ మహీంద్రా (మహీంద్రా గ్రూప్ ఛైర్మన్), ఆర్. దినేశ్ (టీవీఎస్ గ్రూప్ ఛైర్మన్), కిరణ్ మజూందర్ షా (బయోకాన్ ఛైర్పర్సన్) వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు తరలిరానున్నారు. వీరితో పాటు సుమన్ కె బెరి (నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్) మరియు ఎస్బీఐ ఎండీ చల్లా శ్రీనివాసులు శెట్టి వంటి ఆర్థిక, పాలసీ నిపుణులు కూడా పాల్గొననున్నారు.

Varanasi Movie : వారణాసి మూవీ గ్లింప్స్‌లో భయంకరంగా కనిపించే ఆ దేవత ఎవరు?

ఈ సమ్మిట్‌కు అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఎరిక్ స్వైడర్ (ట్రంప్ మీడియా సీఈవో), తారిఖ్ అల్ ఖాసిమి (రస్ అల్ ఖైమా సభ్యుడు), మియో ఒకా (ఏడీబీ ఇండియా కంట్రీ డైరెక్టర్), యున్నూ కిమ (హ్యుందయ్ ఎండీ), హిరోషి పురుటా (తోషిబా సీఎండీ), ఒలివియెర్ ఆండ్రెస్ (శాఫ్రాన్ సీఈవో) వంటి బహుళజాతి సంస్థల అధిపతులు, విదేశీ ఆర్థిక నిపుణులు హాజరవుతున్నారు. ప్రత్యేక ఆకర్షణగా, యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ కూడా దృశ్యమాధ్యమం (Virtual Mode) ద్వారా సదస్సులో పాల్గొననున్నారు. వీరితో పాటు దక్షిణ కొరియా, మలేషియా, ఫిజీ, ఇరాక్, జమైకా, నేపాల్, సింగపూర్ తదితర దేశాల రాయబారులు, హైకమిషనర్ల హాజరుతో సదస్సుకు అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది.

పారిశ్రామిక, రాజకీయ ప్రముఖులతో పాటు ఈ సదస్సుకు సినీ మరియు క్రీడా రంగాల ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. నటులు అజయ్ దేవగన్, రిషబ్ శెట్టి, దర్శకులు ప్రియదర్శన్, అనిరుద్ధరాం చౌధురి వంటి సినీ ప్రముఖులు, అలాగే క్రీడాకారులు పీవీ సింధు, గగన్ నారంగ్ వంటి ఒలింపియన్లు పాల్గొననున్నారు. మిస్ వరల్డ్ 2025 సుచత చౌంగ్ రాక కూడా ఈ సదస్సుకు గ్లామర్ అద్దనుంది. ఇంత పెద్ద ఎత్తున, వైవిధ్యభరిత రంగాల ప్రముఖులు ఒకే వేదికపైకి రావడం తెలంగాణలో పెట్టుబడులు, ఆవిష్కరణలు, మరియు భవిష్యత్తు ప్రణాళికలపై కీలక చర్చలకు, రూ. లక్ష కోట్ల ఒప్పందాలకు దారి తీస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Exit mobile version