Hyderabad: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఒకరోజు తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి హేమంత్ సహదేవ్ రావును బదిలీ చేశారు. ఈ మేరకు జిహెచ్ఎంసి కమిషనర్ ఇంచార్జి ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే సాధారణ పరిపాలన విభాగానికి నివేదించాలని హేమంత్ సహదేవ్ రావును కోరారు.
ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే ఈ కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్న కారణంగా సదరు అధికారిని బదిలీ చేసినట్లు సమాచారం. శనివారం, జూన్ 15న జిహెచ్ఎంసి అధికారులు వైఎస్ జగన్ ఇంటి ఆవరణలో భద్రతా ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ ‘అక్రమ’ నిర్మాణాలను కూల్చివేశారు. పోలీసుల సమక్షంలో ఈ కూల్చివేతలు జరిగాయి.
Days after resigning from the post of Andhra CM, GHMC authorities in Hyderabad demolished ‘illegal’ structures in front of Jagan’s residence at Lotus Pond on Saturday, June 15. pic.twitter.com/IVyHXuKu5H
— The Siasat Daily (@TheSiasatDaily) June 15, 2024
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారాన్ని కోల్పోయిన కొన్ని రోజుల తర్వాత ఈ ఆకస్మిక చర్య జరిగింది. కాగా ఏపీలో చంద్రబాబు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వైసీపీ పార్టీకి 11 సీట్లు గెలుచుకోగా, ఆంధ్రప్రదేశ్ లోని కూటమిలో భాగంగా టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకుంది.
Also Read: Mega vs Allu : మెగా వెర్సస్ అల్లు బాక్సాఫీస్ ఫైట్ రాబోతోందా..? డిసెంబర్లో చరణ్, బన్నీ..!