Ganesh Visarjan 2025: హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవాలు ఈసారి విషాద ఛాయలు మిగిల్చాయి. ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ప్రజలను షాక్కు గురి చేశాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు సహా ఐదుగురు గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:20 గంటల సమయంలో గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గణేశ్ నిమజ్జన బందోబస్తులో భాగంగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ నేతృత్వంలోని పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు అతివేగంగా కారు నడుపుతూ నియంత్రణ కోల్పోయి, పోలీసు జీపును ఢీకొట్టాడు.
ఆ ఢీకొట్టడంలో కారులో ప్రయాణిస్తున్న కశ్వి (20) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లకు కూడా గాయాలయ్యాయి. ప్రమాద వాహనంలో మొత్తం ఐదుగురు యువకులు, ముగ్గురు యువతులు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వారంతా మద్యం సేవించినట్లు తేలింది. కారులో నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Urea Shortage : ప్రభుత్వ అవినీతి వల్లే యూరియా కొరత – బొత్స
ఇంకో ఘటన బషీర్బాగ్లో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక (35) రోడ్డు దాటుతుండగా, గణేశ్ నిమజ్జన ఊరేగింపులోని ఓ వాహనం ఆమెను ఢీకొట్టింది. బలమైన ఢీకొట్టడం వల్ల రేణుక తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సహచరులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ గజానంద్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ రెండు ఘటనలు గణేశ్ నిమజ్జన ఉత్సవాల సందడిని విషాదంలోకి నెట్టాయి. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ఊరేగింపులో అజాగ్రత్త ప్రవర్తన ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
BJP MPs workshop : మరోసారి తన నిరాడంబరతను చాటుకున్న ప్రధాని మోడీ