Site icon HashtagU Telugu

Formula E – 55 Crores : ఫార్ములా ఈ-రేసింగ్ కేసు.. 55 కోట్ల లెక్క తేల్చనున్న రేవంత్ సర్కారు!

Formula E 55 Crores Min

Formula E 55 Crores Min

Formula E – 55 Crores : ఫార్ములా  ఈ – రేసింగ్’ వ్యవహారం త్వరలో అనూహ్య మలుపు తిరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌కు చెందిన ఓ  కీలక నేతకు అది సమస్యగా మారుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.  ఎలాంటి అనుమతులు లేకుండా ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి రూ. 55 కోట్లను అప్పట్లో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖను చూసిన ఐఏఎస్ అర్వింద్ కుమార్ మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం ఆ ప్రాసెస్‌ను చేపట్టలేదు. కనీసం రాష్ట్ర క్యాబినెట్ అనుమతి కూడా తీసుకోలేదు. దీనిపై అర్వింద్ కుమార్‌ను రేవంత్ సర్కార్ వివరణ కోరారు. తెలంగాణ సీఎస్ షోకాజ్ నోటీసు జారీ చేశారు.

వివరణలో ఏముంది ?

దీంతో వివరణ ఇచ్చిన ఐఏఎస్ అర్వింద్ కుమార్..  ‘‘ఫార్ములా ఈ-రేసింగ్‌ వ్యవహారంలో అప్పటి మంత్రి కేటీఆర్ హెచ్‌ఎండీఏ నుంచి డబ్బులు చెల్లించమని చెప్తేనే ఇచ్చాం’’ అని ప్రభుత్వానికి ఆన్సర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయకుండానే..  మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశంతో రూ. 55 కోట్లను(Formula E – 55 Crores) ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి ఇచ్చామని ఆయన అన్నారు. దీంతో ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం బీఆర్ఎస్ గత సర్కారులోని పలువురు పెద్దలకు చుట్టుకోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. గతంలో బీఆర్ఎస్ పెద్దలకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమారే.. ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆనాటి ఓ వ్యవహారాన్ని బయటపెట్టడాన్ని పరిశీలకులు కీలక మలుపుగా అభివర్ణిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ఫార్ములా ఈ-రేసింగ్‌’ను రద్దు చేసింది.

We’re now on WhatsApp. Click to Join

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కదలిక.. 

Also Read : Largest Land Owner : మన దేశంలో ప్రభుత్వం తర్వాత అతిపెద్ద ల్యాండ్ ఓనర్.. ఎవరు ?