తెలంగాణలో పచ్చదనం మూడు శాతం పెరిగిందని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిందని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘మన తెలంగాణలో అటవీ విస్తీర్ణం 3% పెరిగిందని, శాతంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రిత్వ శాఖ రికార్డులకెక్కింది. దీని వెనుక ఉన్న దిగ్గజం మరెవరో కాదు మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు. కేసీఆర్తో ఏదైనా సాధ్యమే.
“ముఖ్యమంత్రి దార్శనికత, స్థితిస్థాపకత మమ్మల్ని సమర్థవంతమైన మార్గంలో కాపాడుతున్నాయి. ఈరోజు అతను చేసే పని రేపు ప్రపంచం అనుకుంటుంది. అతని కిరీటంలో మరో వజ్రం” అంటూ స్పందించారు. సోమవారం లోక్సభలో ఎంపీలు సంగీత కుమారి సింగ్ డియో, జయంత కుమార్ రాయ్ అడిగిన ప్రశ్నకు యూనియన్ పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు భూపేందర్ యాదవ్ సమాధానాన్ని షేర్ చేస్తూ రాజ్యసభ ఎంపీ ఈ వివరాలను ట్వీట్ చేశారు.
ఒకవైపు ఎంపీ సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఛాలెంజ్’.. మరోవైపు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘హరితహరం’ కారణంగా తెలంగాణలో పచ్చదనం పరుచుకుంటోంది. ముఖ్యంగా గ్రీన్ ఛాలెంజ్ సామాన్య జనాల్లోకే కాకుండా, సెలబ్రిటీల్లో సైతం పాకడంతో ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటుతున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం శాతం పెరిగిందని చెప్పక తప్పదు.
His vision and resilience safeguard us in an effective way. He’s second to none in respect of overall development of the state. No one would come closure to him. What he DOES today the world THINKS tomorrow. Another diamond in his crown👇.
— Santosh Kumar J (@SantoshKumarBRS) February 7, 2022