Site icon HashtagU Telugu

First GBS Death : తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. ఇవి తెలుసుకోండి

First Gbs Death Telangana Guillain Barré Syndrome

First GBS Death : గిలైన్ బారె సిండ్రోమ్‌ (GBS) కలకలం రేపుతోంది. ఈ అంతుచిక్కని వ్యాధి బారినపడి తెలంగాణలో తొలిసారిగా ఒకరు చనిపోయారు. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం రాత్రి చనిపోయింది.  ఆమె నెలరోజుల క్రితం జీబీఎస్ వ్యాధి బారినపడింది. తొలుత ఆమెకు సిద్దిపేటలోనే వైద్యం చేయించారు. తదుపరిగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అక్కడి నుంచి కిమ్స్  ఆస్పత్రిలో జాయిన్ చేశారు. సదరు మహిళ చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినా జీబీఎస్(First GBS Death) వ్యాధిబారి నుంచి ఆమెను వైద్యులు కాపాడలేకపోయారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తొలి జీబీఎస్ మరణం నమోదైంది. జీబీఎస్ వ్యాధి ఇప్పటికే పొరుగున ఉన్న మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. అక్కడ ఇప్పటివరకు దాదాపు 200 కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆరుగురు చనిపోయారు.

Also Read :TS RTC Buses : ఆర్టీసీ బస్సుల 25,609 ట్రాఫిక్‌ ఉల్లంఘనలు.. రూ.1.84 కోట్ల ఫైన్‌లు

ఏమిటీ గిలైన్ బారె సిండ్రోమ్‌  ? 

ఎలా వస్తుంది ?