Site icon HashtagU Telugu

Maoist Party Letter: ఆదివాసీ రైతులకు రైతు భరోసా ఇవ్వాలి.. మావోయిస్టు పార్టీ లేఖ విడుదల!

Maoist Party Letter

Maoist Party Letter

Maoist Party Letter: తెలంగాణలో ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు ఊపందుకుంటున్న వేళ, రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) నిశ్శబ్దం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 339 గ్రామాల నివాసితులను ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చిన జీవో నెంబర్ 49ను రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నాయి. ఈ జీవో కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసమేనని, ఆదివాసీల జీవనాన్ని, సంస్కృతిని నాశనం చేసే కుట్రగా ఉందని నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీ (Maoist Party Letter) అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన లేఖ ఆరోపించింది.

ఆదివాసీ హక్కులపై జీవో 49 వివాదం

జీవో 49 పులుల రక్షణ పేరుతో కొమురం భీం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా మూడు జిల్లాలు తెలంగాణ పటంలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్ 8, 2025న ఆసిఫాబాద్‌లో తుడుందెబ్బ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ నిరసన ర్యాలీలో ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. “ఆదివాసుల ఓపికను పరీక్షించొద్దు, జీవో రద్దు చేయకపోతే అగ్నిగుండమవుతుంది” అని తుడుందెబ్బ అధ్యక్షుడు కొట్నాక్ విజరు హెచ్చరించారు.

మావోయిస్టు పార్టీ లేఖలో “ఈ జీవో జంతు పులుల కోసం కాదు, అంబానీ, ఆదానీలాంటి మానవ పులుల కోసం” అని విమర్శించారు. వేల సంవత్సరాలుగా అడవులతో సహజీవనం చేస్తున్న ఆదివాసీలను వారి భూముల నుంచి బలవంతంగా తొలగించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రగా ఈ జీవోను అభివర్ణించారు. రాజ్యాంగం ప్రకారం అడవి సంపద, భూములకు ఆదివాసీలే హక్కుదారులని, కానీ వారి హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.

Also Read: Uttarakhand : అలకనంద నదిలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు

సీతక్క నిశ్శబ్దంపై ప్రశ్నలు

ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఆదివాసీ సమస్యలపై మౌనం వహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఆదివాసీ బిడ్డగా, మాజీ నక్సలైట్‌గా ప్రాచుర్యం పొందిన సీతక్క తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదని మావోయిస్టు పార్టీ, ఆదివాసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. “ఆదివాసీ హక్కుల పరిరక్షణ బాధ్యత సీతక్కదే. ఆమె మాట్లాడకపోవడం సిగ్గుచేటు, అవమానకరం,” అని మావోయిస్టు లేఖలో పేర్కొన్నారు.

ఆదివాసీ డిమాండ్లు