Site icon HashtagU Telugu

Urea Shortage In Telangana : యూరియా కోసం ఎదురుచూసి చూసి..దాడులకు దిగుతున్న రైతులు

Farmer Attacks Pacs Center

Farmer Attacks Pacs Center

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు సరైన సమయంలో ఎరువులు అందక నష్టపోతున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా యూరియా కోసం వ్యవసాయ సొసైటీ కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి బారులు తీరుతున్నారు. అయినా సరే, తమకు కావలసినంత యూరియా దొరకక నిరాశకు గురవుతున్నారు. ఈ పరిస్థితి వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో ఒక రైతు ఆగ్రహానికి కారణమైంది. యూరియా లభించక పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదనతో పీఏసీఎస్ (PACS) సెంటర్‌పై రాళ్ళు విసిరారు.

యూరియా కొరత రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది. సరైన సమయానికి ఎరువులు అందకపోతే తమ శ్రమంతా వృథా అవుతుందని, పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల రైతులు యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఆందోళనలకు, ఘర్షణలకు దిగుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఈ విధమైన ఆందోళనలు, దాడులు రైతుల నిస్సహాయతను, ఆగ్రహాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Trump Tariff: భార‌త్‌కు మ‌రో షాక్ ఇవ్వ‌నున్న ట్రంప్‌?!

ప్రభుత్వం ఈ యూరియా కొరత సమస్యపై వెంటనే దృష్టి సారించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు అవసరమైన యూరియాను సరైన సమయంలో, సరిపడా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే ఈ ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టాలు భారీగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు కీలకమైన ఈ సమయంలో, యూరియా కొరతను తీర్చడం ద్వారా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.