TS : మంచిరెడ్డి కిషన్ రెడ్డిని 8గంటలపాటు విచారించి…కీలక సమాచారం రాబట్టిన ఈడీ.!!

ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని దాదాపు 8 గంటల పాటు ఈడీ విచారించింది.

  • Written By:
  • Publish Date - September 27, 2022 / 10:33 PM IST

ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని దాదాపు 8 గంటల పాటు ఈడీ విచారించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని మంచిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయని ఈడీకి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2014 ఆగస్టులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో మంచిరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో డబ్బులు అవసరం రావడంతో…అమెరికాలోని బంధువు నుంచి రెండువేల యూఎస్ డాలర్లు తీసుకున్నారు.

కాగా తక్కువ సమయంలోనే రూ. 88కోట్ల లావాదేవీలు జరిపినట్లుగా EDగుర్తించింది. శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, థాయిలాండ్, దేశాల్లో ఈ లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించింది ఈడీ. క్యాసినో, గోల్డ్ మైన్స్ లలో అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని ఆధారాలను సేరించేపనిలో ఈడీ ఉన్నట్లుగా తెలుస్తోంది.