హుజురాబాద్ ఉపఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎక్జిట్ పోల్స్ చెప్పినట్టే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్లు 107022. ఇక టీఆర్ఎస్ కు పోలైన ఓట్లు 83167. టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటెల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు.కేసీఆర్ నిరంకుశత్వానికి, హుజురాబాద్ ఆత్మగౌరవానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు తనని ఆదరించినందుకు ఈటెల కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టాక్నున్నారు.
ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో @BJP4Telangana అభ్యర్థి శ్రీ @Eatala_Rajender గారిపై విశ్వాసం ఉంచినందుకు #Huzurabad ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నేటి తీర్పు మన కార్యకర్తల శ్రమకు నిదర్శనం.
ఈటల రాజేందర్ గారికి హార్థిక శుభాకాంక్షలు!
1/3 pic.twitter.com/9kWxCv10eQ
— G Kishan Reddy (@kishanreddybjp) November 2, 2021
అవినీతి టిఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలను ఎదిరించి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శ్రీ @Eatala_Rajender గారికి హృదయపూర్వక శుభాభినందనలు.
బిజెపిని గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు, ఈ విజయం కోసం కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు. pic.twitter.com/llNABGmF98— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 2, 2021
Live : Celebrating Huzurabad elections victory at party office https://t.co/fNv5R39D9I
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 2, 2021