Huzurabad Results: ఈటెల అను నేను…

  • Written By:
  • Updated On - November 2, 2021 / 08:12 PM IST

హుజురాబాద్ ఉపఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎక్జిట్ పోల్స్ చెప్పినట్టే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్లు 107022. ఇక టీఆర్ఎస్ కు పోలైన ఓట్లు 83167. టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటెల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు.కేసీఆర్ నిరంకుశత్వానికి, హుజురాబాద్ ఆత్మగౌరవానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు తనని ఆదరించినందుకు ఈటెల కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టాక్నున్నారు.