Kidney Theft – Hyderabad : రోగికి తెలియకుండా కిడ్నీ కాజేసిన డాక్టర్లు

Kidney Theft - Hyderabad : మనిషి దగ్గరున్న ఏదైనా వస్తువు దొంగిలించబడే అవకాశం ఉంటుంది.. కానీ అతడి బాడీలోని పార్ట్స్ దొంగతనానికి గురయ్యే ఛాన్స్ ఉండదు. 

  • Written By:
  • Updated On - December 18, 2023 / 02:10 PM IST

Kidney Theft – Hyderabad : మనిషి దగ్గరున్న ఏదైనా వస్తువు దొంగిలించబడే అవకాశం ఉంటుంది.. కానీ అతడి బాడీలోని పార్ట్స్ దొంగతనానికి గురయ్యే ఛాన్స్ ఉండదు.  కానీ కొందరు డాక్టర్లు ఓ రోగికి తెలియకుండా.. అతడి కిడ్నీని దొంగిలించారు. ఖమ్మ జిల్లా కొత్తగూడెంకు చెందిన రేణుకుంట్ల రవిరాజు అనే మెకానిక్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. అతడు 2011లో కోల్​కతాలోని తన బంధువుల ఇంటికి వెళ్లగా కడుపు నొప్పి రావడంతో అక్కడే ఉన్న ఆసుపత్రిలో చూపించుకుని హెర్నియాకు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ చికిత్సకు ముందు జరిపిన వైద్య పరీక్షల్లో ఎడమవైపు కిడ్నీ  కనిపించడం లేదని డాక్టర్లు చెప్పారు. ఆ మాటలను పట్టించుకోని రవిరాజు.. 2012లో కడుపు నొప్పి రావడంతో ఖమ్మం మెడికేర్​ డయాగ్నోస్టిక్​ సెంటర్​, మమత మెడికల్​ కాలేజీల్లో టెస్టులు చేయించుకున్నాడు. అక్కడ కూడా ఒక కిడ్నీ లేదన్న విషయాన్ని తెలుసుకుని.. చివరకు వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించాడు. హెర్నియా ఆపరేషన్​ సమయంలో సికింద్రాబాద్​లోని పౌలోమి ఆసుపత్రి వైద్యులు తనకు తెలియకుండా కిడ్నీని దొంగిలించారని.. దాన్ని రూ.50 లక్షలకు అమ్ముకున్నారని రవిరాజు(Kidney Theft – Hyderabad) కంప్లయింట్ చేశాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. 2009 జులైలో హెర్నియా సమస్యతో రవిరాజు సికింద్రాబాద్​లోని పౌలోమి ఆస్పత్రిలో చేరగా అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి రెండు కిడ్నీలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. రాజీవ్​ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రవిరాజుకు ఆపరేషన్ చేసి జులై 31న డిశ్చార్జి చేశారు.ఈ విషయంలో వైద్యుల తీరును వినియోగదారుల కమిషన్​ ​ తప్పుబట్టింది. ఇందుకు పరిహారంగా రూ.30 లక్షలతో పాటు ఖర్చుల కింద రూ.25 వేలు ఇవ్వాలని సికింద్రాబాద్​ పౌలోమి ఆసుపత్రికి చెందిన డాక్టర్​ నందకుమార్​ బి.మధేకర్​, డాక్టర్​ ప్రసాద్​ బెహరాలకు ఆదేశించింది.

Also Read: Mallika Sagar : రేపే ఐపీఎల్ మినీ వేలం.. ఆక్షనీర్‌గా ‘మల్లిక’.. ఎవరామె ?

వాస్తవానికి ఈ వ్యవహారంలో తమ తప్పేం లేదని పౌలోమి ఆసుపత్రి డాక్టర్లు తొలుత  వినియోగదారుల కమిషన్​ ఎదుట వాదన వినిపించారు. అయితే రవిరాజును డిశ్చార్జి చేసే ముందు అల్ట్రాసౌండ్​ పరీక్ష చేసినట్లు రుజువులను సమర్పించడంలో డాక్టర్లు విఫలమయ్యారు. దీంతో వారు తప్పు చేసినట్లుగా భావించిన వినియోగదారుల కమిషన్.. ఆపరేషన్​ ముసుగులో చట్టవిరుద్ధంగా కిడ్నీ తీసుకున్నారని గుర్తించింది.