Free Bus Effect : యాదాద్రికి పోటెత్తిన భక్తులు

రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లిన ఫ్రీ అవ్వడం తో..పుణ్యక్షేత్రాలతో పాటు పర్యటన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - December 10, 2023 / 02:40 PM IST

కాంగ్రెస్ (Congress) అమలు చేసిన మహాలక్ష్మి పథకాన్ని (Free Bus ) మహిళలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. మొన్నటి వరకు బస్సు చార్జీల కు భయపడి..ఎక్కడికి వెళ్లాలన్న వందసార్లు ఆలోచించే మహిళలు..ఇప్పుడు ఫ్రీ బస్సు సౌకర్యం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించడంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లిన ఫ్రీ అవ్వడం తో..పుణ్యక్షేత్రాలతో పాటు పర్యటన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు ఆదివారం కావడం తో హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (yadadri ) శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి సైతం భక్తుల తాకిడి ఎక్కువైంది. కార్తీకమాసం చివరి రోజు కావడం, ఆదివారం కావడం అలాగే ఫ్రీ బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడం తో భక్తులు పోటెత్తారు. దీంతో, స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. కొండ కింద వ్రత మండపంలో భక్తులతో నిండిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు వ్రతమాచరించారు. దీపారాధనలో భక్తులు భారీగా పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.

Read Also : కాంగ్రెస్ పథకాలను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే..