Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు నాటి విపక్ష నేతలతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారుల ఫోన్లపై నిఘా పెట్టారని విచారణలో తేలింది. తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఈ కేసులో బుధవారం కౌంటర్ అఫిడవిట్ను దర్యాప్తు ఆఫీసర్లు దాఖలు చేశారు. దానిలోని కీలక వివరాలను ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు ఎవరెవరి సీడీఆర్, ఐపీడీఆర్లను సేకరించారనే వివరాల్లోకి వెళితే ఈ జాబితాలో అనుముల రేవంత్రెడ్డి, అనుముల కొండల్రెడ్డి, అనుముల తిరుపతిరెడ్డి, వినయ్రెడ్డి ఉన్నారు. వీరితో పాటు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, ఈటల నితిన్, ధర్మపురి అర్వింద్, శివధర్రెడ్డి, ఎ.ఆర్.శ్రీనివాస్, రాఘవేందర్రెడ్డి, ఎం.రమేశ్రెడ్డి, రొనాల్డ్రాస్, దివ్య (ఐఏఎస్ అధికారిణి)ల సీడీఆర్, ఐపీడీఆర్లను సేకరించారు. శశాంక్ తాతినేని, సునీల్రెడ్డి, చిలుక రాజేందర్రెడ్డి, కె.వెంకటరమణారెడ్డి, నరేంద్రనాథ్ చౌదరి, తీన్మార్ మల్లన్న, మహేశ్వర్రెడ్డి, ఏఎంఆర్ ఇన్ఫ్రా, వీరమల్ల సత్యం, మేఘా శ్రీనివాస్రెడ్డి, మైనంపల్లి రోహిత్, పీడీ కృష్ణకిషోర్ తదితరుల సీడీఆర్, ఐపీడీఆర్లను సేకరించారు.