Site icon HashtagU Telugu

Revanth Reddy: 12 నెలల తర్వాత అధికారంలోకి వ‌చ్చేది కాంగ్రెస్సే – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth

Revanth

12 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని అన్నారు.వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గ్రామ‌మైన అక్కంపేటలో తన తొలి రచ్చబండ కార్యక్రమంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అధికార పార్టీ నాయకులు అక్కంపేట గ్రామాన్ని పూర్తిగా విస్మరించడంతో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్‌కు రైల్వే లైన్‌ వేయకుండా కేసీఆర్‌ అడ్డుకున్నారని ఆరోపించారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మాణానికి జీఓ నెం.69 తీసుకొచ్చానని… 2011లో నియోజకవర్గంలోని తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపానని తెలిపారు. తెలంగాణ రైతుల విజ్ఞప్తుల మేరకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత క్వింటాలుకు రూ.2,500లకు వరి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ డిక్లరేషన్‌పై విస్తృత ప్రచారం కల్పించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.