Congress MP Candidates List : లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) కోసం కాంగ్రెస్ పార్టీ 57 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు(Five parliamentary constituencies) అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి (ఎస్సీ) గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి స్థానానికి సునీత మహేందర్రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవేళ్ల నుంచి రంజిత్రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. తొలి జాబితాలో నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
Congress releases the third list of 57 candidates for the upcoming Lok Sabha elections.
Adhir Ranjan Choudhary to contest from Berhampore, West Bengal. pic.twitter.com/Obg0yGub5s
— ANI (@ANI) March 21, 2024
We’re now on WhatsApp. Click to Join.
జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ నుంచి కుందూర్ రఘువీర్, మహబూబ్నగర్ చల్లా వంశీచందర్, మహబూబాబాద్ (ఎస్టీ) బలరాం నాయక్ను అభ్యర్థులుగా ప్రకటించింది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్, ఖమ్మం, మెదక్, వరంగల్, భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా… మరో 5మంది పేర్ల ప్రకటన
పెద్దపల్లి – గడ్డం వంశీ
సికింద్రాబాద్ – దానం నాగేందర్
మల్కాజిగిరి – సునీత మహేందర్ రెడ్డి
నాగర్ కర్నూల్ – మల్లు రవి
చేవెళ్ల – గడ్డం రంజిత్ రెడ్డి#TelanganaCongress #LokSabhaElections2024 #HashtagU pic.twitter.com/Y1CIuXOpx6— Hashtag U (@HashtaguIn) March 21, 2024
read also: Kejriwal Arrest : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. లిక్కర్ స్కాంలో సంచలన పరిణామం