Site icon HashtagU Telugu

Congress Party : మరో 20 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్

TPCC Mahesh Kumar Goud Comments On BJP, BRS

TPCC chief Mahesh Kumar

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ(Congress)దే మరో 20 ఏళ్ల పాటు అధికారమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర రాజకీయాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందంటే “చిన్న పిల్లోడు కూడా నవ్వుతాడు” అంటూ తీవ్రంగా విమర్శించారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ పని కూడా అయిపోయిందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Rishabh Pant: రిష‌బ్ పంత్‌పై మాథ్యూ హేడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ ప్ర‌శంస‌లు!

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ఉద్యమం గురించి కూడా ప్రస్తావించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం, కేసీఆర్ కంటే ఎక్కువ ఉద్యమం చేశారని అన్నారు. అయితే, “అదృష్టం ఉండి కేసీఆర్ సీఎం అయ్యాడు, కోదండరాం వెనక పడ్డాడు” అని వ్యాఖ్యానించారు. కోదండరాం వంటి ఉద్యమకారులు చట్టసభల్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చామని తెలిపారు.

కోదండరాం ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రణాళికలు, రాజకీయ ప్రత్యర్థులపై దాని వైఖరి స్పష్టమవుతోంది. ముఖ్యంగా, బీఆర్ఎస్, బీజేపీలపై ఆయన చేసిన విమర్శలు రానున్న రోజుల్లో మరింత రాజకీయ వేడిని పెంచే అవకాశం ఉంది.