కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్)కు కోవర్టుగా పనిచేస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. కంది మండలం ఆరుట్ల గ్రామంలో 2,300 కి.మీ పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ.. కేటీఆర్ కోసం జగ్గారెడ్డి రహస్యంగా పనిచేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తెలుసు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“అతను కాంగ్రెస్లో కొనసాగాలనుకుంటున్నారా లేదా మరొక రాజకీయ పార్టీలో చేరాలనుకుంటున్నారా అనే విషయంలో అతనికి స్పష్టత లేదు” అని ఆమె తనపై విమర్శలు చేసినందుకు జగ్గారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి మీడియా ముందుకొచ్చి షర్మిల వ్యాఖ్యలను ఖండించారు. తన నియోజవర్గంలో పర్యటించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదనీ వార్నింగ్ ఇచ్చాడు.
KTR కోవర్టు జగ్గారెడ్డి, మతి తప్పి మాట్లాడుతున్నాడు.YSR పార్టీ మారాడట. ఎప్పుడు మారాడయ్యా? రోజుకో పార్టీ నువ్వు మారి పిచ్చిఎక్కి మాట్లాడుతున్నావా? నీ నియోజకవర్గం కోసం ఏనాడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించావా?జ్ఞానం లేకుండా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు.#PrajaPrasthanam #Sangareddy pic.twitter.com/uvce8FqE9Z
— YS Sharmila (@realyssharmila) September 26, 2022