Congress Vs BJP : తెలంగాణకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ‘గాడిద గుడ్డు’ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం ఏమేం అడిగింది ? బీజేపీ ఏమేం ఇచ్చింది ? ఇచ్చింది గాడిద గుడ్డే అంటూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. గాంధీ భవన్లో ఈ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి, అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మొండిచెయ్యి ఇచ్చిన అంశాల జాబితాలో ఆ బ్యానర్లలో(Congress Vs BJP) ప్రస్తావించారు. దాని ప్రకారం.. తెలంగాణ నుంచి పన్ను ఆదాయంగా రూ.1 పంపిస్తే.. 43 పైసలు వెనక్కి ఇస్తామని ఇచ్చిన హామీని కేంద్రంలోని బీజేపీ సర్కారు నిలుపుకోలేకపోయిందని ప్రస్తావించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇస్తామని బీజేపీ సర్కారు బుకాయించి, మాట తప్పిందని పేర్కొన్నారు. మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు జాతీయ హోదాను ఇస్తామని బీజేపీ సర్కారు బుకాయించి.. మాట దాటవేసిందన్నారు. కేంద్ర బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటాను తెలంగాణ ఇస్తామని చెప్పి.. బీజేపీ సర్కారు మోసం చేసిందన్నారు. కనీసం ఒక్క ఐఐఎం, ఎన్ఐడీ విద్యా సంస్థను కూడా తెలంగాణకు బీజేపీ సర్కారు కేటాయించలేదని కాంగ్రెస్ పార్టీ బ్యానర్లలో రాశారు.