ఉప ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సెప్టెంబర్ 1 నుంచి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయాలని ఓటర్లను కోరనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాజకీయ పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించేందుకే టీఆర్ఎస్, బీజేపీలు కమిటీలు వేస్తున్నాయని ఆరోపించారు. ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లను వేటాడేందుకు టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోనే, అభివృద్ధి పనులకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్న బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వాదనను రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో విఫలమై డిండి లిఫ్ట్-ఇరిగేషన్ ప్రాజెక్టును పెండింగ్లో ఉంచి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు (కేసీఆర్) అన్యాయం చేశారని రేవంత్ అన్నారు. సీఎం కేసీఆర్, పీఎం మోడీ దొందు దొందే అని, ప్రజలు నమ్మొద్దని రేవంత్ రెడ్డి అన్నారు.