ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. చాల చోట్ల కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకొని తమ సత్తా చాటగా, బిఆర్ఎస్ సైతం అధికార పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీనే ఇచ్చింది. కాగా త్వరలో రాష్ట్రంలో ZPTC , MPTC ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికల ఫై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Published By: HashtagU Telugu Desk
CM Revanth Delivers Great News to Workers in Telangana

CM Revanth Delivers Great News to Workers in Telangana

  • తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలు
  • స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ పై సీఎం రేవంత్ సమీక్షా
  • ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ ఫై సీఎం రేవంత్ సమావేశం

    తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా, అందరి ఏకాభిప్రాయంతో ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ వేదికగా ప్రత్యేక చర్చను నిర్వహించి, ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. స్థానిక సంస్థల పాలనను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

 

ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ప్రధానాంశంగా మారాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఈ రిజర్వేషన్ల సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, చట్టపరమైన అంశాలపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బహుజన వర్గాలకు రాజకీయంగా సరైన ప్రాధాన్యత కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. కుల గణన నివేదిక ఆధారంగా ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

రాజకీయ అంశాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కృష్ణా, గోదావరి జలాల పంపిణీపై కూడా ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. తెలంగాణ నీటి వాటా విషయంలో గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అన్యాయంపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు కోరినా, ఈ జల వివాదాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో, నీటి ప్రాజెక్టుల నిర్వహణ మరియు హక్కుల విషయంలో ఎవరి పాత్ర ఏమిటో తేల్చాలని ఆయన నిర్ణయించుకున్నారు.

  Last Updated: 18 Dec 2025, 09:31 PM IST