CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

CM Revanth Reddy : రేపు డిల్లీలో జరగనున్న కాంగ్రెస్ జాతీయ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రత్యేకంగా పాల్గొననున్నారు

Published By: HashtagU Telugu Desk
World Economic Forum

World Economic Forum

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు సాయంత్రం డిల్లీ(Delhi)కి బయల్దేరనున్నారు. రేపు డిల్లీలో జరగనున్న కాంగ్రెస్ జాతీయ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రత్యేకంగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యనేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది.

సింగపూర్ పర్యటన :

డిల్లీ పర్యటన ముగిసిన వెంటనే రేవంత్ రెడ్డి సింగపూర్ ప్రయాణం చేపట్టనున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు ఆయన సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వ్యాపార, ఆర్థిక రంగాల్లో తెలంగాణ అభివృద్ధి కోసం నూతన ఒప్పందాలపై చర్చించే అవకాశం ఉంది.

వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సదస్సు :

సింగపూర్ పర్యటన అనంతరం సీఎం రేవంత్ దావోస్‌కు వెళ్తారు. ఈ నెల 20న జరిగే వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నాయకులు, వ్యాపార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సదస్సు ఒక మంచి వేదికగా మారనుంది.

తెలంగాణ అభివృద్ధిపై దృష్టి :

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు పూర్తిగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించగా, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధి అవకాశాల ప్రోత్సాహానికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ప్రత్యేకంగా సింగపూర్ మరియు దావోస్ పర్యటనలు తెలంగాణకు పెద్ద మొత్తంలో పెట్టుబడులను తీసుకురావడానికి దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. పర్యటన పూర్తయ్యాక, సాధించిన ఒప్పందాలు, ప్రణాళికల గురించి మీడియాకు తెలియజేస్తారని ఆయన కార్యాలయం ప్రకటించింది. ఈ పర్యటనలు తెలంగాణ రాజకీయ, ఆర్థిక రంగాల్లో కొత్త మలుపు తిప్పుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  Last Updated: 14 Jan 2025, 10:36 AM IST