Makhdoom Bhavan : బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్‌రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి

సురవరం సుధాకర్‌రెడ్డి ఒక గొప్ప ప్రజానేత. విద్యార్థి దశ నుంచే సామాజిక న్యాయం కోసం పోరాడారు. పేదల పక్షాన నిలిచి, బహుజనుల హక్కుల కోసం నిస్వార్థంగా ఉద్యమించారు.అని ప్రశంసించారు. సురవరం పాలమూరు జిల్లాకు చెందినవారిగా జాతీయ స్థాయిలో నాయకత్వం వహించారన్న విషయాన్ని సీఎం గర్వంగా పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
cm-revanth-reddy-paid-tributes-to-the-mortal-remains-of-suravaram-sudhakar-reddy

cm-revanth-reddy-paid-tributes-to-the-mortal-remains-of-suravaram-sudhakar-reddy

Makhdoom Bhavan: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాదులోని మఖ్దూం భవన్‌కి వెళ్లిన సీఎం, పూలమాలను ఉంచి అజరామర నాయకుడికి తుదిశ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సురవరం సుధాకర్‌రెడ్డి ఒక గొప్ప ప్రజానేత. విద్యార్థి దశ నుంచే సామాజిక న్యాయం కోసం పోరాడారు. పేదల పక్షాన నిలిచి, బహుజనుల హక్కుల కోసం నిస్వార్థంగా ఉద్యమించారు.అని ప్రశంసించారు. సురవరం పాలమూరు జిల్లాకు చెందినవారిగా జాతీయ స్థాయిలో నాయకత్వం వహించారన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గర్వంగా పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో జన్మించి  దేశవ్యాప్తంగా ప్రజానాయకుడిగా వెలుగొందిన వారు చాలా అరుదు. ఆయన విధేయత ప్రజాప్రేమ ప్రతి ఒక్కరికీ ఆదర్శం. అధికారం ఉన్నా లేకున్నా, సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ తన సిద్ధాంతాలకు రాజీపడలేదు అని గుర్తుచేశారు.

Read Also: Cheteshwar Pujara : క్రికెట్‌కి వీడ్కోలు పలికిన ఛతేశ్వర్‌ పుజారా

సుదీర్ఘ కాలం కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన నాయకుడిగా సురవరం అందించిన సేవలు ఈ తరం మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలకూ ప్రేరణగా నిలుస్తాయని సీఎం అన్నారు. అలాగే, సురవరం సుధాకర్‌రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. మేం ఆయన జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ విషయంలో మంత్రివర్గంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం. గతంలో పలువురు మహానేతల పేర్లను ప్రభుత్వ సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు పెట్టినట్టు, సురవరం గారి సేవలను చిరస్మరణీయంగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. సురవరం గారు ఏ పదవిలో ఉన్నా సమానత్వానికి, సామాజిక న్యాయానికి, ప్రజల సమస్యలకు నిబద్ధంగా పనిచేశారు. ఈ విధమైన నాయకుల త్యాగాలను గుర్తు చేసుకోవడం, రాబోయే తరాలకు పరిచయం చేయడం మన బాధ్యత. సీపీఐ కార్యాలయం మఖ్దూం భవన్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు కమ్యూనిస్టు నేతలు, ఇతర రాజకీయ నాయకులు, అభిమానులు హాజరయ్యారు. సురవరం సుధాకర్‌రెడ్డి మరణం దేశ రాజకీయాలకు తీరనీయన కోల అని పలువురు అభిప్రాయపడ్డారు. జీవితాంతం ప్రజల కోసమే పనిచేసిన ఒక ఉద్యమ నాయకుడికి, ముఖ్యమంత్రి నివాళులు అర్పించడం ద్వారా ప్రభుత్వ స్థాయిలో గౌరవం తెలియజేయడం అభినందనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Read Also: Agni-5 : భారత అమ్ముల పొదలో మరో మైలురాయి..

  Last Updated: 24 Aug 2025, 12:09 PM IST