Chandrachud: సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(Chief Justice is Justice DY Chandrachud)ను తెలంగాణ(telangana)ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా(Taj Falaknuma)లో ఉన్న ఆయనను కలిసిన రేవంత్రెడ్డి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో వంద ఎకరాల్లో నిర్మించనున్న నూతన హైకోర్టుకు సంబంధించి ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నట్టు తెలిసింది.
హైదరాబాద్ తాజ్ ఫలక్ నూమాలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ గారిని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. pic.twitter.com/pxxNQL7bKj
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2024
We’re now on WhatsApp. Click to Join.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో వంద ఎకరాల్లో నిర్మిస్తున్న నూతన హైకోర్టు నిర్మాణ పనులకు జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ పీవీ సంజయ్కుమార్, జస్టిస్ ఎస్వీ భట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో 32 జిల్లా కోర్టులకు ఈ-సేవా కేంద్రాలను ఆన్లైన్ ద్వారా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రారంభించారు.