Lok Sabha Polls 2024: రాష్ట్రంలో లోకసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గతేడాది ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్, లోకసభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ని బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ బాధ్యతలను సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
షెడ్యూల్ భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలైంది, మధ్యాహ్నం ఒంటి గంటలకు నిజామాబాద్, సాయంత్రం 4 గంటలకు మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో సీఎం ప్రసంగిస్తారు. ఇక రేపు నాగర్ కర్నూల్ ప్రచారం చేయనున్నారు. అంతేకాదు ఈ నెల 24 వరంగల్, 25న చేవెళ్ల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరవుతారని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి.
లోకసభ ఎన్నికల్లో 15 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఆ దిశగానే వ్యూహంతో ముందుకెళ్తుంది. కాగా లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డితో పాటు ఢిల్లీ పెద్దలు రాహుల్ గాంధీ , ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు కూడా పాల్గొంటారు.
Also Read: Amit Shah : అమిత్ షా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు