CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప జ్వరం బారినపడ్డారు. దీంతో ఆయన జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గత మూడు రోజులుగా జ్వరం, గొంతు నొప్పి, జలుబు, దగ్గుతో రేవంత్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ రేవంత్ను పరీక్షించి, మందులు సూచించినట్లు సమాచారం. ఇంటి వద్దే రేవంత్కు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా చేస్తున్నారని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినప్పటి నుంచే రేవంత్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. ఆదివారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలోనూ రేవంత్ కొంత నీరసంగా కనిపించారు.
We’re now on WhatsApp. Click to Join.