Telangana: కేసీఆర్ కుటుంబానికి సీఎం రేవంత్ సవాల్.. దమ్ముంటే రండి

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులపై సవాల్ విసిరారు సీఎం రేవంత్. సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఉభయసభల్లో చర్చకు రావాలని కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవితకు సవాల్ విసిరారు రేవంత్.

Telangana: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులపై సవాల్ విసిరారు సీఎం రేవంత్. సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఉభయసభల్లో చర్చకు రావాలని కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవితకు సవాల్ విసిరారు రేవంత్.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్‌, హరీశ్‌రావు అబద్ధాల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలోని ప్రతీది తాను అడిగిన దాని ఆధారంగానే కేంద్రం రూపొందించిందని కేసీఆర్ ఆరోజు ప్రకటించారు. ఇప్పుడు బీఆర్ఎస్ తన తప్పులను దాచేసి కాంగ్రెస్‌పై నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఫైర్ అయ్యారు. రాష్ట్రాల మధ్య 811 టీఎంసీల కృష్ణా జలాల పంపకంపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం కమిటీ వేసిందని, అందులో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చామని అన్నారు. అయితే అప్పట్లో కేసీఆర్ కాగితాలపై సంతకం చేసి ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నీరు వెళ్లేలా చేశారని ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల ఒత్తిడికి కేసీఆర్ లొంగిపోయి కృష్ణా నది ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ మీద హక్కు కల్పించేలా ప్రవర్తించినట్టు రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రోజుకు 8 టీఎంసీల నీటిని ఏపీకి తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. కేసీఆర్ 2022 మే 5న జీవో జారీ చేయడం ద్వారా ఈ అనుమతి లభించిందని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ముచ్చుమర్రి ప్రాజెక్ట్ నిర్మించబడింది. వారు 800 అడుగుల నీటిని తరలించడానికి ప్రయత్నించారు. పదవులు, కమీషన్ల కోసం కేసీఆర్ నీటి చౌర్యానికి లొంగిపోయారు. ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ప్రాజెక్టులను విస్మరించారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే 10 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుందని రేవంత్ అన్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు.

ఎన్నికల్లో ఓడిపోయి ప్రజలకు ముఖం చూపించలేక కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బలప్రయోగం చేసినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ అంశంపై మా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందని స్పష్టం చేశారు.

Also Read: Vastu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులను అస్సలు జారవిడచకండి.. లేదంటే ఆర్థిక నష్టం కలగడం ఖాయం?