CM Revanth Reddy : సెమీస్‌లో కేసీఆర్‌ ఓడించారు..ఇప్పుడు ఫైనల్‌లో మోడీ ఓడించాలి

ఉద్యమ సమయంలో కరీంనగర్ ప్రజలు కేసీఆర్‌కు అండగా ఉన్న.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన ఈ జిల్లాను పట్టించుకోవలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు

Published By: HashtagU Telugu Desk
Donkey Egg

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సెమిస్ లో కేసీఆర్ ను చిత్తుచిత్తుగా ఓడించారు..ఇప్పుడు ఫైనల్ లో బిజెపి ని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు జమ్మికుంటలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ కీలక పాత్ర పోషించిన విషయాన్నీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక భూమిక పోషించిందని , ఉద్యమ సమయంలో కరీంనగర్ ప్రజలు కేసీఆర్‌కు అండగా ఉన్న.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన ఈ జిల్లాను పట్టించుకోవలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఐదేళ్లలో కేంద్రం నుండి తెలంగాణకు తెచ్చిందేమి లేదని , రాముడి పేరు చెప్పి బీజేపీ (BJP) ఓట్లు అడుగుతోందని పేర్కొన్నారు.

సెమీ ఫైనల్లో కేసీఆర్‌ను ఓడించాం..ఫైనల్లో గుజరాత్ గులాములను ఓడిస్తామని .. మోడీ తెలంగాణకు ఇచ్చింది ఏం లేదని.. బండి సంజయ్ రాష్ట్రానికి తెచ్చింది ఏం లేదన్నారు. తెలంగాణను మోదీ అవమానిస్తుంటే..బండి సైలెంట్‌గా ఉన్నారని ధ్వజమెత్తారు. గుండు, అరగుండును గెలిపిస్తే.. ఏం చేశారని ప్రశ్నించారు. నిజామాబాద్, కరీంనగర్ బీజేపీ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Read Also : Chandrababu : ఏలూరుపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి..!

  Last Updated: 30 Apr 2024, 05:39 PM IST