తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం (MLC Elections Campaign) ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ తరఫున విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ బహిరంగ సభలను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ (NZB), ఆదిలాబాద్ (ADB), కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
రేవంత్ ప్రచార షెడ్యూల్ – మూడు జిల్లాల్లో సభలు
సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి, నిజామాబాద్ (NZB) చేరుకొని ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాల (ADB) జిల్లాలో మరో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ పట్టభద్రులకు ఓటు వేసేలా ప్రచారం చేస్తారు. ఈ సభల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ విజయం కోసం పట్టభద్రులకు ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునివ్వనున్నారు.
ఎన్నికల వేడి – కాంగ్రెస్ వ్యూహం
ఈ ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు అత్యంత కీలకమైనది కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమ అభ్యర్థిని గెలిపించేందుకు అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తోంది. సీఎం రేవంత్ ప్రసంగాల్లో ప్రభుత్వ పథకాలను, భవిష్యత్తు ప్రణాళికలను ప్రస్తావించనున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభావాన్ని పెంచేందుకు రేవంత్ స్వయంగా రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Record in Cricket History : భారత్ vs పాక్ మ్యాచ్కు 60 కోట్ల వ్యూస్