మొంథా తుఫాన్ తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. వరంగల్, హుస్నాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి, చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. పంట పొలాలు నీటమునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని గ్రామాలు వరద నీటితో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. నేడు ఆయన పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా, ప్రతికూల వాతావరణం కారణంగా పర్యటన వాయిదా పడింది.
Baahubali – The Epic : బాహుబలి ప్రీమియర్ టికెట్ల పేరుతో మోసాలు..తస్మాత్ జాగ్రత్త
సీఎం రేవంత్ ఇప్పటికే సంబంధిత అధికారులకు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇవ్వాలని సూచించారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తక్షణ సహాయం అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు విధుల్లోకి దిగాయి. తుఫాన్ కారణంగా మౌలిక వసతులు దెబ్బతిన్న ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు, విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రజల సురక్షిత తరలింపునకు ప్రాధాన్యతనిస్తూ ఆశ్రయ కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసింది.
ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది. తుఫాన్ ప్రభావిత రైతులకు తగిన పరిహారం ఇవ్వడం, పంటల నష్టంపై ప్రత్యేక అంచనా వేయడం, పేద కుటుంబాలకు ఆహార సరఫరా చేయడం వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. సీఎం రేవంత్ మాట్లాడుతూ, “ప్రజల ప్రాణ రక్షణ మా మొదటి బాధ్యత. ఏ ఒక్కరూ నిరాశ్రయులుగా ఉండకూడదు. ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు. తుఫాన్ తీవ్రత తగ్గిన వెంటనే ఆయన స్వయంగా గ్రామాలకు వెళ్లి బాధితులను పరామర్శించనున్నారని సమాచారం.
