Site icon HashtagU Telugu

Medigadda : మామా అల్లుళ్లు అతి తెలివితేటలతో మేడిగడ్డ , అన్నారం బ్యారేజిలను నిర్మించారు – సీఎం రేవంత్

Vanamahotsava Program

Hyderabad has no competition with any other city in the country.. it only competes with world cities: CM Revanth Reddy

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు ఒకే రకమైన సాంకేతిక సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సమస్యల వల్ల ఈ మూడు బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయని, సాంకేతిక నిపుణులు కూడా భవిష్యత్తులో అవి కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన అల్లుడి (KCR & Harishrao)అతి తెలివితేటలతో ఈ బ్యారేజీలను నిర్మించారని, వాటి నిర్మాణంలో శాస్త్రీయమైన పద్ధతులను పాటించలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రకటన రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనను రేకెత్తించింది.

Viral video : వరద ప్రాంతాల్లో పర్యటన..ఆప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్, బండి సంజయ్

ఈ బ్యారేజీలకు ఉన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారని మీడియా ప్రశ్నించగా, ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఎం తెలిపారు. ముందుగా ఈ బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలపై నిపుణుల కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో చర్చిస్తామని, ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మేడిగడ్డలో ఎత్తిన నీళ్లను సుందిళ్లలో, సుందిళ్లలో ఎత్తిన నీళ్లను అన్నారంలో, అన్నారంలో ఎత్తిన నీళ్లను ఎల్లంపల్లిలో పోయడానికి ఈ బ్యారేజీలు ఒకదానికొకటి అనుసంధానంగా నిర్మించారని, అందువల్ల ఒక బ్యారేజీ కూలితే మిగిలిన వాటిపైనా ప్రభావం పడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ తెలిపిన దాని ప్రకారం.. ఈ బ్యారేజీలకు ఉన్న సమస్యలను పరిష్కరించడం అంత సులభం కాదని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే, ప్రభుత్వానికి ఒక స్పష్టత వస్తుందని, అప్పుడు వాటిని ఎలా రిపేరు చేయాలో లేదా పునర్నిర్మించాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి ఎంత వ్యయం అవుతుంది, ఎంత సమయం పడుతుంది అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, ఈ ప్రాజెక్టుల భద్రతపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర రాజకీయ, సాంకేతిక చర్చకు దారితీశాయి.