తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈసారి ఉక్రెయిన్ బాధితులకు మద్దతుగా లేఖను సంధించారు. ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు ప్రధాని మోడీ సహకరించాలని సీఎం కేసీఆర్ అభ్యర్థించారు. 20,000 మంది ఉక్రేనియన్ విద్యార్థులు (వైద్య విద్యార్థులు) భారతదేశానికి తిరిగి వచ్చారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని కేసీఆర్ లేఖ ద్వారా స్పష్టం చేశారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ సహకరించాలని కేసీఆర్ కోరారు. వైద్య విద్యను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. దేశంలోని వైద్య సంస్థల్లో సీట్లు కల్పించాలని మోడీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. బాధితుల్లో 700 మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారని, ఈ విద్యార్థులకు అయ్యే ఖర్చులన్నీ రాష్ట్రమే భరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలో సూచించారు.
CM Sri KCR, in a letter addressed to Hon’ble Prime Minister Sri @NarendraModi ji, has requested to enable Indian students, dislocated from #Ukraine due to the war, to join Medical colleges in country in equivalent semesters in relaxation of extant regulations. pic.twitter.com/ODfM7D6Okk
— Telangana CMO (@TelanganaCMO) March 29, 2022