Site icon HashtagU Telugu

Cheetah: గుండెపోటుతో చీతా మృతి.. హైదరాబాద్‌లోని జూ పార్కులో ఘటన

Cheetah

Resizeimagesize (1280 X 720) (4)

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో దశాబ్దం క్రితం సౌదీ యువరాజు బహుమతిగా ఇచ్చిన 15 ఏళ్ల మగ చిరుత (Cheetah) గుండెపోటుతో మరణించింది. అబ్దుల్లా అనే చిరుత శనివారం చనిపోయిందని జూ అధికారి ఒకరు తెలిపారు. జూ అధికారులు పోస్టుమార్టం నిర్వహించగా గుండెపోటుతో మృతి చెందినట్లు తేలింది. హైదరాబాద్‌లో జరిగిన COP11 సమ్మిట్-2012 సందర్భంగా సౌదీ యువరాజు బందర్ బిన్ సౌద్ బిన్ మహ్మద్ అల్ సౌద్ రెండు జతల ఆఫ్రికన్ సింహాలు, చిరుతలను బహుమతిగా ప్రకటించారు.

Also Read: YCP MLA : ప్ర‌భుత్వ స‌ల‌హాదారు “స‌జ్జ‌ల” నుంచే నాకు ప్రాణ హాని – ఎమ్మెల్యే శ్రీదేవి

జంతు ప్రదర్శనశాల ఈ జంతువులను 2013లో సౌదీ అరేబియా జాతీయ వన్యప్రాణి పరిశోధనా కేంద్రం నుండి స్వీకరించింది. ఆడ చిరుత 2020లో మరణించింది. అప్పటి నుండి అబ్దుల్లా ఒంటరిగా ఉంటోంది. ఆడ చిరుత హిబా ఎనిమిదేళ్ల వయసులో మరణించింది. హిబాకి పారాప్లీజియా అనే వ్యాధి వచ్చింది. అబ్దుల్లా మృతితో నెహ్రూ జూలాజికల్ పార్కులో చిరుతలు కనిపించడం లేదు. భారతదేశంలో చిరుతలు దాదాపు 70 సంవత్సరాల క్రితం అంతరించిపోయినట్లు ప్రకటించారు. గతేడాది నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.