BRS vs Congress : రైతుల‌కు రేవంత్ క్ష‌మాప‌ణ చెప్పాలి : రాజ్య‌స‌భ స‌భ్యుడు వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

24 గంట‌ల‌ ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు ఇంకా చ‌ల్లార‌లేదు. రైతుల మనోభావాలను దెబ్బతీసినందుకు పీసీసీ

Published By: HashtagU Telugu Desk
Congress BRS

Congress BRS

24 గంట‌ల‌ ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు ఇంకా చ‌ల్లార‌లేదు. రైతుల మనోభావాలను దెబ్బతీసినందుకు పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి బేషరతుగా రైతుల‌కు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. 24 గంట‌ల‌ ఉచిత విద్యుత్ గురించి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ..ముందు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను వర్తింపజేసేలా పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించాలని ఆయన రేవంత్‌కి సూచించారు.

ఉచిత విద్యుత్‌పై తన ప్రకటనల ద్వారా రేవంత్ రెడ్డి వ్యవసాయంపై అవగాహన లేమిని, రైతుల పట్ల చిన్నచూపును ప్రదర్శించారని ఎంపీ ర‌విచంద్ర అన్నారు. సీఎం కేసీఆర్ రైతు అనుకూల పాలనపై రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలను సమర్థించుకుని ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని, వ్యాఖ్యానించారు. రేవంత్ కేవలం టీడీపీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని.. రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. గత తొమ్మిదేళ్లలో రైతులను తీర్చిదిద్దేందుకు కేసీఆర్ మాత్రమే కృషి చేశారని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు భీమా తదితర పథకాలను వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయడం లేదని వద్దిరాజు ప్రశ్నించారు.

  Last Updated: 19 Jul 2023, 08:28 AM IST