Kavitha Vs ED : కేజ్రీవాల్, సిసోడియాతో కవిత డీల్.. ఈడీ సంచలన రిపోర్టు

Kavitha Vs ED : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన బీఆర్ఎస్ ‌ఎమ్మెల్సీ కవిత 14 పేజీల రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు కీలక వివరాలను వెల్లడించారు.

  • Written By:
  • Updated On - March 17, 2024 / 09:43 AM IST

Kavitha Vs ED : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన బీఆర్ఎస్ ‌ఎమ్మెల్సీ కవిత 14 పేజీల కస్టడీ రిపోర్టులో ఈడీ అధికారులు కీలక వివరాలను వెల్లడించారు. కవితను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఈ కేసులోని నిందితుల వాంగ్మూలం, వాట్సాప్ ఛాట్స్‌ను సేకరించామని ఈడీ తెలిపింది. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగానే కవితను విచారించినట్లు స్పష్టం చేసింది. సరైన సమాధానం చెప్పకపోవడం, ఆధారాలపై బుకాయించడం వల్ల కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని తేల్చి చెప్పింది. కవితను(Kavitha Vs ED) కస్టడీలో విచారిస్తే  మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు.

ఆ వాట్సాప్ ఛాట్‌ను చూపించాక..

ఎమ్మెల్సీ కవిత, శరత్ చంద్రారెడ్డితో కలిసి పెట్టుబడి పెడుతున్నట్లు అరుణ్ పిళ్లై తనకు చెప్పారని సమీర్ మహేంద్రు విచారణలో తెలిపాడని ఈడీ గుర్తు చేసింది. ఇండో స్పిరిట్ లో కవిత తరఫున అరుణ్ పిళ్లై భాగస్వామిగా ఉన్నారని చెప్పింది. ఇండో స్పిరిట్స్ లో కవితకు 33 శాతం వాటా ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ  వెల్లడించింది. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘవల మధ్య సాగిన వాట్సాప్ చాట్ లో ఇండో స్పిరిట్స్ లో కవితకు 33 శాతం వాటా ఉన్న విషయాన్ని గుర్తించామని  ఈడీ వివరించింది. ఈ చాట్స్ ను తాము చూపించిన తర్వాత కూడా కవిత బుకాయించినందు వల్లే అరెస్టు చేశామని తెలిపింది.

ఢిల్లీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎంలతో డీల్ : ఈడీ

మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డిలతో కలిసి కవిత సౌత్ గ్రూపును నడిపించారని ఈడీ అభియోగం మోపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాతో ఎమ్మెల్సీ కవిత పలుమార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించింది. కేజ్రీవాల్, సిసోడియాలతో కవిత ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలిందని చెప్పింది. కేజ్రీవాల్, సిసోడియాల తరఫున ఆప్ నేత విజయ్ నాయర్  ఎమ్మెల్సీ కవితతో సంప్రదింపులు జరిపినట్లు  కేంద్ర దర్యాప్తు సంస్థ వివరించింది. కవిత సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి పలువురు దళారులకు ముడుపులు అందజేశారని ఈడీ వివరించింది. దీనికి ప్రతిగా ఆప్ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ముందే మద్యం పాలసీ వివరాలను అందించారని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి  100 కోట్ల రూపాయలు ఇవ్వడంలో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది.  బినామీ రామచంద్రపిళ్లై ద్వారానే ఈ వ్యవహారాన్ని కవిత నడిపారని వివరించింది. ఎంపీ మాగుంట ద్వారా 30 కోట్ల రూపాయలను కవిత ఢిల్లీకి తరలించినట్లు తెలిపింది. అభిషేక్ బోయినపల్లి హవాలా మార్గం ద్వారా ఈ డబ్బును ఢిల్లీలోని ఆప్ నేతలకు చేరవేశారని ఈడీ  వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join

కస్టడీ రిపోర్టులోని కీలక అంశాలివీ.. 

ఈడీ కస్టడీ రిపోర్టులో మొత్తం 18 అంశాలను ప్రస్తావించింది. వాటిలో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రమేయం ఉన్నవారి చిట్టా, దర్యాప్తు సంస్థల విచారణ సమాచారం, ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారీ, దీనిపై దాఖలైన కేసు, ఈ కేసులో అరెస్టయిన వారి స్టేట్మెంట్లు, చేతులు మారిన రూ.100 కోట్లకు సంబంధించి వివరాలు ఉన్నాయి.

కవిత, శరత్ చంద్రారెడ్డితో కలిసి పెట్టుబడి పెడుతున్నట్లు పిళ్లై తనకు చెప్పారని సమీర్ మహేంద్రు తెలిపారని ఈడీ గుర్తు చేసింది. ఇండో స్పిరిట్ లో కవిత భాగస్వామిగా ఉన్నారని.. ఆమె ఆప్ నేతకు రూ.100 కోట్లు ఇచ్చినట్లు ఈడీ వాదించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా తరఫున ఆప్ నేత విజయ్ నాయర్ సంప్రదింపులు జరిపినట్లు వివరించింది. ఇండో స్పిరిట్ లో కవిత తరఫున అరుణ్ పిళ్లై భాగస్వామిగా ఉన్నారని తెలిపింది.

కవిత, శరత్ చంద్రారెడ్డితో కలిసి పెట్టుబడి పెడుతున్నట్లు పిళ్లై తనకు చెప్పారని సమీర్ మహేంద్రు తెలిపారని ఈడీ గుర్తు చేసింది. ఇండో స్పిరిట్ లో కవిత భాగస్వామిగా ఉన్నారని.. ఆమె ఆప్ నేతకు రూ.100 కోట్లు ఇచ్చినట్లు ఈడీ వాదించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా తరఫున ఆప్ నేత విజయ్ నాయర్ సంప్రదింపులు జరిపినట్లు వివరించింది. ఇండో స్పిరిట్ లో కవిత తరఫున అరుణ్ పిళ్లై భాగస్వామిగా ఉన్నారని తెలిపింది.