ఖమ్మంకు చెందిన మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వర్ రావు ఎట్టకేలకు ఆ పార్టీని వీడి వచ్చే వారం కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో జరిపిన చర్చలను తుమ్మల ఖరారు చేసి, పార్టీలో చేరేందుకే మొగ్గు చూపినట్లు సమాచారం.సెప్టెంబరు 6న ఆయన న్యూఢిల్లీ వెళ్లి ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 21న 115 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించినప్పటి నుంచి తుమ్మల కలత చెందారు.
మాజీ మంత్రి పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ టిక్కెట్ ఆశించగా, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి ఫిరాయించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కందాడ ఉపేందర్రెడ్డిని బీఆర్ఎస్ అధినేత తన వద్దే ఉంచుకున్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావును ఎమ్యెల్యేగా పంపిన కేసీఆర్ తుమ్మలతో చర్చలు జరిపి పార్టీలోనే కొనసాగేలా ఒప్పించినా.. ఆ తర్వాత మాత్రం ఊరుకోలేదు. పార్టీ శ్రేణులతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాటలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
తుమ్మల ప్రభావం ‘కమ్మ’ జనాభా ఎక్కువగా ఉన్న ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయనుండడంతో ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులును మార్చేస్తుంది. ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తుమ్మలను పోటీకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ తిరుగుబాటుదారులు మైనంపల్లి హనుమంతరావు, రేఖానాయక్లు కూడా నాగేశ్వరరావుతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పీసీసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
Also Read: Salaar: ఓపెనింగ్స్ లో సలార్ సరికొత్త రికార్డ్, ఆర్ఆర్ఆర్ తర్వాత అదేస్థాయిలో!