KTR: రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ కమిటీ: కేటీఆర్

KTR: రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన విస్తృతంగా అధ్యయనం చేయడానికి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక కమిటీని వేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ తమ స్థితిగతుల పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షులు కేసిఆర్ ఆదేశాల మేరకు వారి సమస్యలను వారు, కోరుకుంటున్న పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు ఈ కమిటీని వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. […]

Published By: HashtagU Telugu Desk
Protests Of IT Employees

KTR Meeting with Khammam Bhadradri Leaders in Telangana Bhavan Interesting comments on Congress

KTR: రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన విస్తృతంగా అధ్యయనం చేయడానికి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక కమిటీని వేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ తమ స్థితిగతుల పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షులు కేసిఆర్ ఆదేశాల మేరకు వారి సమస్యలను వారు, కోరుకుంటున్న పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు ఈ కమిటీని వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఈ కమిటీలో భాగంగా కార్మిక విభాగం నాయకులు రూప్ సింగ్, రామ్ బాబు యాదవ్, మరయ్య లు ఆటో డ్రైవర్ల ప్రతినిధులతో మాట్లాడుతారు. కేవలం ఆటో డ్రైవర్లే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఓలా, ఉబెర్ మరియు ఇతర టాక్సీ డ్రైవర్లతో కూడా వీరు చర్చించి ఒక నివేదికను పార్టీకి అందజేస్తారు. కార్మిక విభాగం నాయకులు అందించే నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇస్తామని, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read: TSRTC: దయచేసి అలాచేయకండి: మహిళా ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి!

  Last Updated: 23 Dec 2023, 11:19 AM IST