Praja Bhavan : ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్‌..

  • Written By:
  • Publish Date - May 28, 2024 / 01:53 PM IST

Praja Bhavan: హైదరాబాద్‌ బేగంపేటలోని ప్రజాభవన్‌కు(Praja Bhavan:) బాంబు బెదిరిపుల కాల్‌( bomb threat call)వచ్చింది. ప్రజాభవన్‌లో బాంబు ఉందని కంట్రోల్‌ రూమ్‌(Control room)కు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ప‌ది నిమిషాల్లో బాంబు పేలుతుంద‌ని హెచ్చ‌రించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్ర‌జా భ‌వ‌న్ ఆవ‌ర‌ణ‌లోనే డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క నివాసం ఉంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఇటీవ‌ల ఢిల్లీ, ముంబయి, కోల్‌క‌తాలోని ప్ర‌ముఖ ప్ర‌దేశాల‌కు బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చిన విషయం తెలిసిందే. ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ వెనుక ఓ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో తెలంగాణ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

Read Also: Love Story : దృష్టి లోపమున్నా కల నెరవేర్చుకున్న సిమ్రాన్.. కోచ్‌గా మారిన భర్త