Site icon HashtagU Telugu

Liquor Scam : క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీపై ఈడీ, సీబీఐ దాడులు చేయాలి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లపై దర్యాప్తు సంస్థ దాడులు చేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) ఆయ‌న‌ కుటుంబ సభ్యుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఎందుకు సోదాలు చేయడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు చేయడంలో ఈడీ జాప్యం చేస్తే సాక్ష్యాధారాలు మాయమయ్యే అవకాశాలున్నాయన్నారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలైన వాసవీ గ్రూప్‌, సుమధుర, ఫీనిక్స్‌పై జరిపిన దాడుల వివరాలను వెల్లడించనందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులను ఆయన తప్పుబట్టారు.

రాజకీయ ప్రత్యర్థులను బెదిరించి ఎన్నికల్లో గెలవడానికి ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటున్నారని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్యే అసలైన పోరు ఉందని, కాంగ్రెస్‌ ఉనికి లేదని ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.