Site icon HashtagU Telugu

Bandi Sanjay : మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం..!!

Telangana BJP

Sanjay bandi

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. మునుగోడులో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. ట్విట్టర్ టిల్లు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఓటుకు రెండువేలరూపాయలు ఇచ్చి ఓటర్లను తీసుకురమ్మని కేటీఆర్ చెప్పాడు. బెదిరింపులకు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా అని అన్నారు సంజయ్. ఓటింగ్ ను వినియోగించుకుని అందరికీ చక్కటి మెసెజ్ అందించారు. లాఠీఛార్జీలను సైతం తట్టుకుని నా కార్యర్తలు హీరోలుగా పనిచేశారు. వారందరికీ నా ధన్యవాదాలు.

మునుగోడు ఉపఎన్నిక ప్రారంభం నుంచి టీఆర్ఎస్ పార్టీ మొత్తం అక్కడే మకాం వేసిందన్నారు. ఈసీ కేసీఆర్ కు చుట్టంలా మారిపోయారు. ఎన్ని ఆధారాలు చూపించినా ఈసీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలిచి తీరుతుందని దీమా వ్యక్తం చేశారు. మునుగోడు కాబోయే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డే అన్నారు బండి సంజయ్.

Exit mobile version