మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ముమ్మర ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు మునుగోడు గడ్డపై కమలం జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది. సీపీ భగవత్ 3 సంవత్సరాలకు పైగా ఈ పదవిలో ఉన్నారని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించింది. మునుగోడు ఉపఎన్నికకు ముందు రాచకొండ సీపీపై ఫిర్యాదు చేయడం ఆసక్తిని రేపుతోంది. ఈసీని కలిసినవాళ్లలో నేతల్లో తెలంగాణ బీజేపీ ఇన్ చార్జి తరుణ్ ఛుగ్ ఉన్నారు.
Leaders of #BJP @BJP4Telangana urge @ECISVEEP Election Commission to take action against #Rachakonda CP Mahesh Bhagwat @RachakondaCop ahead of #Munugode bypoll, violation is CP Bhagwat is in this post for more than 3 years @DeccanChronicle @bandisanjay_bjp pic.twitter.com/q6ZQocXnaz
— Sriram Karri (@oratorgreat) October 13, 2022