ఇటీవల ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ (TCongress) కొత్త కమిటీపై అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త ప్యానెళ్లలో పలువురు సీనియర్ నేతల పేర్లు లేకపోవడంతో కీలక నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన పీసీసీ ప్యానెళ్లకు ఆమోదం తెలిపిన తీరుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఏసీలో తమను విస్మరించారని రేవంత్ రెడ్డిని కొండా సురేఖ లేవనెత్తిన మరుసటి రోజే వి.హనుమంతరావు, జె.గీతారెడ్డి, ఎ.మహేశ్వర్రెడ్డి, మధు యాస్కీగౌడ్ సహా సీనియర్ నేతలు భట్టిని కలిశారు. తాజాగా గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో భట్టి మాట్టాడారు. ‘అసలు’ కాంగ్రెస్ నేతలకు ‘అన్యాయం’ జరగకూడదని భట్టి సీనియర్ నేతలనుద్దేశించి అభిప్రాయపడ్డారు.
“కమిటీల్లో అస్తవ్యస్త ప్రాతినిధ్యంపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు అందుతున్నాయి. మేం పరిణామాలపై ఆలోచిస్తాం ”అని భట్టి అన్నారు. ముఖ్యమైన పదవిలో తాను ఉన్నప్పటికీ, 1990 తర్వాత తొలిసారిగా కమిటీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, పీఏసీలను ఖరారు చేశారు. అయితే ఈ సమావేశానికి తనను ఆహ్వానించలేదని ”అని భట్టి (Bhatti Vikramarka) గుర్తు చేశారు. ఇప్పటికే కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, హన్మంతరావు సైతం కొత్త కమిటీపై మండిపడ్డారు. కొత్త కమిటీ మళ్లీ పురాలోచన చేయాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Also read: Hanumantha Rao Comments: కొత్త పార్టీలను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలి!