Bandi Sanjay: బిజెపి ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ ఇవాళ వరంగల్(Warangal)పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ పై కొందరు వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర(prajahita yatra)లో భాగంగా తాజాగా వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్దకు చేరుకోగానే సంజయ్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కోడి గుడ్లతో దాడికి చేశారు. ఈ దాడులకు పాల్పడిందని కాంగ్రెస్ కార్యకర్తలేనని బండి సంజయ్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గుడ్ల దాడి నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గుడ్లు విసిరిన వారి గుర్తించాలని డిమాండ్ చేశారు. కోడిగుడ్లు విసిరేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గత రెండు రోజుల నుంచి ఎంపీ బండి సంజయ్, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ దాడితో అసహనం చెంది బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పోలీసు బందోబస్తు ఏం వద్దని.. మీరు వెళ్లిపోండి.. అంటూ పోలీసులపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పోలీసుల సమక్షంలో దాడి జరిగినా పట్టించుకోవడం లేదు. నాకు భద్రత అక్కర్లేదు.. పోలీసులు వెళ్లిపోవాలి. నా రక్షణ మా కార్యకర్తలే చూసుకుంటారు అని బండి సంజయ్ అన్నారు.
బండి సంజయ్ మీద కోడి గుడ్ల దాడి
కోడిగుడ్ల దాడితో అసహనం చెంది పోలీసు బందోబస్తు నాకు ఏమీ వద్దు.. మీరు వెళ్లిపోవాలని చెప్పిన బండి సంజయ్.
వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ప్రజాహిత యాత్ర చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బండి సంజయ్ కాన్వాయ్ మీద గుడ్లు విసిరారు. pic.twitter.com/U6AwJAs5nJ
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2024
read also : March 1st : మార్చి 1 విడుదల.. కొత్త నెల కొత్త రూల్స్