దసరా తర్వాతి రోజు గురువారం అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అలయ్-బలయ్ కార్యక్రమాన్ని దాదాపు 17 ఏళ్ల నుంచి బండారు దత్తాత్రేయ నిర్వహిస్తూ వస్తున్నారు. అలయ్ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. అంతకుముందు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.. చిరంజీవిని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
దసరా పండగ నేపథ్యంలో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం అందర్నీ మైమరిపించింది. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు ఒకే వేదికపై కనిపించడంతో కొత్త జోష్ నింపినట్టయింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి డప్పు కొడుతూ అందర్నీ ఉత్సాహపర్చారు. చిరు రాకతో అలయ్ బలయ్ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యా సాగర్రావు, మాజీ ఎంపీలు వీహెచ్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సారి నిర్వహించిన కార్యక్రమానికి వివిధ ప్రధాన పార్టీల కీలక నేతలు చాలామంది దూరంగా ఉన్నారు.
Met noted film personality and former Union Minister Shri Chiranjeevi ji today at his residence in #Hyderabad along with my daughter Bandaru Vijayalakshmi and invited him for #AlaiBalai cultural festival to be held on October 6 at Exhibition Grounds, #Nampally, Hyderabad. pic.twitter.com/ymDVEqEAo9
— Bandaru Dattatreya (@Dattatreya) October 5, 2022